20-05-2025 01:33:28 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, మే 19 : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సోమవారం సుమారు (97) మంది ఫిర్యాదుదారులు వారి పిర్యాదులను సమర్పించగా ,అందులో జిల్లా అధికారులకు సంబంధించి (44), రెవెన్యూ అంశాలకు సంబంధించి (53) ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఫిర్యాదులలో ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలకు సంబంధించినవి ఎక్కువగా ఉండగా,ఉద్యోగం, ఉపాధి, తదితర అంశాలు, భూములకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి.
అయితే ఫిర్యాదుదారులు ప్రతి వారం పెరుగుతూ వస్తున్నందున జిల్లా అధికారులు ప్రత్యేకంగా ఈ అంశంపై శ్రద్ధ తీసుకోవాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ని, ఆ వారంలో వచ్చిన ఫిర్యాదులు అదేవారం పరిష్కరించేందుకు కృషి చేస్తే ఫిర్యాదుల సంఖ్య తగ్గుతుందన్నారు.
ఇంచార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి, జిల్లా అధికారులు, తదితరులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులను స్వీకరించారు.