6 May, 2026 | 10:34 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

యూరియా నిలువపై ప్రత్యేక దృష్టి సారించాలి

26-07-2025 10:36 PM

తెలంగాణ రాష్ట్ర మార్కెట్ సొసైటీ  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి..

నేరేడుచర్ల (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంను తెలంగాణ స్టేట్ మార్కెట్ సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి(Telangana State Market Society Director Srinivas Reddy), నల్గొండ జిల్లా మార్కెట్ డైరెక్టర్ పద్మ, హుజూర్నగర్ వ్యవసాయ సహాయ సంచాలకులు రవిలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు యూరియా నిల్వ, స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. తదుపరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎరువుల కొరత ఏమీ లేదన్నారు. కృత్రిమంగా ఎవరైనా ఎరువుల కొరత సృష్టించిన వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట పిఎసిఎస్ ఇబ్బంది ఉన్నారు.