4 July, 2026 | 10:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

శ్రీ రామానుజాచార్య అందరికీ ఆదర్శం

03-05-2025 12:23 AM

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  

 రాజేంద్రనగర్, మే 2: శ్రీ రామానుజాచార్య అందరికీ ఆదర్శంప్రాయమని, ఆయన చూపిన మార్గం అనుసరణీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. శ్రీ భగవత్ రామానుజాచార్య 1008 వ తిరునాక్షేత్ర మహోత్సవం శంషాబాద్ మండలంలోని ముచింతల్ సమతా మూర్తి కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది.

శుక్రవారం రాత్రి ఆయన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తిరు నక్షత్రం మహోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. అంతకుముందు గవర్నర్కు సమతా మూర్తి కేంద్రం ట్రస్టు ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.  శుక్రవారం ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.