4 April, 2026 | 2:59 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి రథయాత్ర..

01-10-2025 06:04 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయం అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, వేణుమాధవ్, చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో కన్నుల పండువగ ఈ వేడుకలు నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా జరిగిన రథయాత్ర శోభయాత్రలో భాగంగా మహిళల కోలాటాలు, ఆడిన ఆటలు పాటలు... భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత వారం రోజులుగా నడుస్తున్న రథయాత్ర వేడుకలు దసరా పండుగతో ముగుస్తాయి. ఈ వేడుకల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.