2 June, 2026 | 6:04 PM

Breaking News

కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు   •   పరిపాలన చేతకాక సీఎం బూతు మాటలు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే తలసాని   •   రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం   •   అమరుల త్యాగాలే తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి పునాదులు   •   పారమితలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   విద్యార్థుల ప్రాణ త్యాగాలు.. కెసిఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు   •   పెద్దకాపర్తిలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   వాడవాడలా తెలంగాణ అవతరణ వేడుకలు   •   సీఎం రేవంత్ రెడ్డి నమ్మిన బంటు ఆసిఫ్ అలీకి అరుదైన గుర్తింపు   •   ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం అభినందనీయం   •  

అంగరంగ వైభవంగా శ్రీ వేణుగోపాలస్వామి రథయాత్ర..

01-10-2025 06:04 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం రథయాత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దేవాలయం అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, వేణుమాధవ్, చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో కన్నుల పండువగ ఈ వేడుకలు నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా జరిగిన రథయాత్ర శోభయాత్రలో భాగంగా మహిళల కోలాటాలు, ఆడిన ఆటలు పాటలు... భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గత వారం రోజులుగా నడుస్తున్న రథయాత్ర వేడుకలు దసరా పండుగతో ముగుస్తాయి. ఈ వేడుకల్లో ప్రతిరోజు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.