calender_icon.png 27 October, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీడీవోగా శ్రీలేఖ బాధ్యతల స్వీకరణ

27-10-2025 07:09:02 PM

వీర్నపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవోగా బి శ్రీలేఖ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే గ్రూప్-1 పరీక్ష రాసి విజయం సాధించి ఎంపీడీవో ఉద్యోగం పొందారు. ఇంతవరకు ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన బిరయ్య నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీలేఖ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా, సక్రమంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతి కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, నాయకులు కొత్త ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలియజేశారు.