15 June, 2026 | 7:02 PM

Breaking News

పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •   దోమకొండ కెనరా బ్యాంకులో సైబర్ మోసాలపై అవగాహన   •  

ఎంపీడీవోగా శ్రీలేఖ బాధ్యతల స్వీకరణ

27-10-2025 07:09 PM

వీర్నపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీర్నపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవోగా బి శ్రీలేఖ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూనే గ్రూప్-1 పరీక్ష రాసి విజయం సాధించి ఎంపీడీవో ఉద్యోగం పొందారు. ఇంతవరకు ఇక్కడ ఇన్‌చార్జి ఎంపీడీవోగా పనిచేసిన బిరయ్య నుంచి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీలేఖ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా, సక్రమంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. గ్రామ పంచాయతి కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది, నాయకులు కొత్త ఎంపీడీవోను కలిసి అభినందనలు తెలియజేశారు.