4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఎస్‌ఎస్‌సీ జిల్లా టాపర్‌కు సత్కారం

03-05-2025 12:13 AM

 రాజేంద్రనగర్, మే 2: సర్కిల్ పరిధిలోని మైలార్దేవ్ పల్లి డివిజన్ కాటేదాన్ శాంతినగర్ గవర్నమెంట్ స్కూల్ కు చెందిన పదో తరగతి విద్యార్థి పాపిశెట్టి కార్తీక్ జిల్లా టాపర్గా నిలిచాడు.

ఈ సందర్భంగా శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి అతడిని సత్కరించారు. కార్తీక్ రంగారెడ్డి జిల్లాలో టాపర్ గా నిలవడం అదృష్టమన్నారు. అతడు తమ డివిజన్ విద్యార్థి కావడం చాలా ఆనందకరమని పేర్కొన్నారు.

శాంతినగర్ స్కూల్ ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూల్ కి దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా తోకల శ్రీనివాస్ రెడ్డి విద్యార్థికి ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవితో  పాటు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు.