26-06-2025 12:00:00 AM
చలపతి ఫార్మసీ విద్యార్థిని ఉమామహేశ్వరి ఘనత
గుంటూరు, జూన్ 25 (విజయ్క్రాంతి): ఆంధ్ర విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసిన పీజీబొ ఫలితాల్లో చలపతి ఫార్మసీ విద్యార్థిని ఏ ఉమామహేశ్వరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిందని కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు తెలిపారు. బుధవారం స్టేట్ ఫస్ట్ ర్యాంకర్తో పాటు 100 ర్యాంకులు లోపు వచ్చిన విద్యార్థులను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ మొ త్తం.. 32 మంది పరీక్షకు హాజరుకాగా నూరు శాతం విద్యార్థులు విజయ ఢంకా మోగించారన్నారు.
తనూజ భాగ్యశ్రీ స్టేట్ ఏడవ ర్యాం కు, సిహెచ్ వీరమోహన్రెడ్డి 25వ ర్యాంకు, డి వేలంగిని రాణికి 42వ ర్యాంకు, కి లక్ష్మీసాయి 64వ ర్యాంకు, బి తనుజ 99వ ర్యాం కులు సాధించి కళాశాల కీర్తి పతాకాన్ని ఎగరవేశారని తెలిపారు. వెయ్యిలోపు 22 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు.
విద్యార్థులను జి-ఫ్యాట్, నైపర్, పీజీ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయటానికి ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెం టర్ను కళాశాలలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ద్వారా అనుభవజ్ఞులైన అధ్యాపకుల చే విద్యార్థులకు ఉచితంగా ప్రత్యేక శిక్షణ తరగతులు ఇస్తూన్నారని తెలిపారు. విద్యార్థుల ను చలపతి విద్యా సంస్థల అధినేత వైవి ఆంజనేయులు సన్మానించారు.