16 April, 2026 | 10:07 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రహదారిపై ధాన్యాన్ని ఆరబెడితే ప్రమాదాలు జరుగుతాయి

13-04-2025 10:06 PM

ఎస్సై మమ్మద్ గౌస్

కొల్చారం,(విజయక్రాంతి): కొల్చారం రోడ్లపై ధాన్యాన్ని ఆరబెడితే కఠిన చర్యలు ఉంటాయని మండల స్థానిక ఎస్సై మహమ్మద్ గౌస్ అన్నారు. ఆదివారం రోడ్లపై పోసిన దాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కల్లాలలోనే వేసి ఆరబెట్టుకోవాలని, జాతీయ రహదారిపై వడ్లు ఆరబెట్టి ప్రజా రవాణాకు భంగం కలిగించకూడదన్నారు. వెంటనే రోడ్డు పైన వేసిన ధాన్యాన్ని తీసివేసి కల్లాలలో ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 765 డి నిత్యం  నిత్యం ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి కావున ఈ రహదారి పైన వరి ధాన్యాన్ని ఆరబెడితే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున ఈ విషయమును రైతులు   గమనించి జాతీయ రహదారి పైన వరి ధాన్యాన్ని ఆరబెట్టకూడదని అన్నారు