17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

డెటాల్ తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

01-11-2025 08:48 AM

తల్లి ముందు ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపం

డెటాల్ తాగిన బాలిక

పరిస్థితి విషమం.. దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. దేవరకొండ మండలం(Devarakonda Mandal) పెంచికల్ పహాడ్ ఎస్సీ బాలికల గురుకులంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలికను మౌనికగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక విద్యార్థిని ఇంటికి వెళ్లింది. నిన్న తన తల్లితో కలిసి విద్యార్థిని గురుకుల పాఠశాలకు వచ్చింది. తన తల్లి ముందే ప్రిన్సిపల్ తిట్టిందనే మనస్తాపంతో బాలిక డెటాల్ తాగింది. పరిస్థితి విషమించడంతో బాధిత విద్యార్థినిని దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.