17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బీజేపీ, బీఆర్ఎస్ నుండి కాంగ్రెసులోకి

01-11-2025 10:28 AM

పేరూరు పంచాయతీ నుండి పలు నాయకుల చేరికలు.

వాజేడు,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు, మండలంలో పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకుల సేవలకు ఆకర్షితులైన బిజెపి బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కోరం పగిడయ్య,ఆత్మకూరు ప్రవీణ్ ఆత్మకూరి రాఘవ రాజు గొబ్బూరి రఘుపతి, కురసం రాంబాబు,తనూరి జయరాజులకు కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి పౌరుడికి అందేలాగా కృషి చేస్తామని అన్నారు. మండల నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దంచులూరి విశ్వనాథ ప్రసాదరాజు, దాట్ల సీతారామరాజు, సొసైటీ ఉపాధ్యక్షులు జగన్నాథ రాజు, నాయకులు ఎస్.కె ఖాజావలి, కాకర్లపూడి కళ్యాణ్, రమేష్, కురుశం కృష్ణమూర్తి, బంధం కృష్ణ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు