వివాహ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు
01-11-2025 10:17 AM
మంథని,(విజయక్రాంతి): కమాన్ పూర్, ముత్తారం మండలాల్లో పలు వివాహా వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) ఆశీర్వదించారు. కమాన్పూర్ మండలంలో, ముత్తారం మండల కేంద్రాల్లో వివాహాల్లో పాల్గొన్న శ్రీను బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీను బాబు వెంట కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, యూత్ మండల అధ్యక్షులు బక్కతట్ల వినయ్ యాదవ్, రెబల్ రాజ్ కుమార్, నాయకులు బుచ్చం రావు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






