9 April, 2026 | 10:41 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థులు

15-10-2025 10:03 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ (మోడల్) పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి పి మణిదీప్ జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపిక అయ్యాడని పాఠశాల ప్రిన్సిపల్ సారా తస్నీమ్ బుధవారం తెలిపారు. అక్టోబర్ 6, 10 న జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ నిర్వహించిన జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ అండర్ 19 ఫుట్ బాల్ ఎంపిక పోటీలలో మణిదీప్ పాల్గొని, సత్తా చాటాడని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రస్థాయి అండర్ 19 కబడ్డీ పోటీలకు మోడల్ కళాశాలకు చెందిన విద్యార్థిని శశిరేఖ ఎంపికైనట్లు తెలిపారు.

ఇటీవల నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన క్రీడాకారులు మహబూబాబాద్ జిల్లాలో జరిగే పోటీల్లో ఉమ్మడి జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు  ప్రాముఖ్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో పిడి చిన్నక్క పాల్గొన్నారు.