9 April, 2026 | 8:47 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

కేకే ఓసీపీలో దొంగతనానికి యత్నించిన దొంగలు

15-10-2025 10:00 PM

పోలీసులకు అప్పగింత..

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని కేకే ఓసీపీ స్టోర్స్ లో మంగళవారం ముగ్గురు దొంగలు దొంగతనానికి యత్నించగా, గమనించిన సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, ఎంటిఎఫ్ టీం దొంగలను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఓసిపి స్టోర్స్ దగ్గర దొంగతనానికి ముగ్గురు దొంగలు ప్రయత్నిస్తుండగా గమనించిన ఎంటిఎఫ్ సెక్యూరిటీ గార్డ్ పి సదానందం సంబంధిత అధికారులకు ఫోన్ లో తెలపడంతో ఎంటిఎఫ్ టీం అక్కడికి వెళ్లి స్టోర్స్, ఓసిపి యార్డ్ పరిసర ప్రాంతాల్లో వెతకగా, యార్డ్ లోపల దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలను పట్టుకాగా మరొకరు పారిపోయాడు.

అనంతరం ఇద్దరు దొంగలను ఏరియాలోని ఎస్ అండ్ పిసి కంట్రోల్ రూమ్ లో ఉంచి, బుధవారం వారిని పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం కార్యాలయంలో బుధవారం ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ సింగరేణి సెక్యూరిటీ సిబ్బందిని, ఎంటిఎఫ్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఎస్ఎస్ఓ రవి, జూనియర్ ఇన్స్పెక్టర్ బఠారి చంద్రమౌళి, ఇంటెలిజెన్స్ శ్రీనివాస్ రావు, మర్రి శ్రీనివాస్, పురుషోత్తం, సదానందం, గుండం రమణ, చిరుత రఘులు పాల్గొన్నారు.