calender_icon.png 2 December, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యక్షేత్రంలో విద్యార్థుల పూజలు

02-12-2025 12:53:53 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 1: రాష్ట్రంలోని తొలి సూర్యక్షేత్ర మైన తిమ్మాపురంలోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని జిల్లా కేంద్రం సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ లో ఉన్న న్యూ మిలీనియం హైస్కూల్ విద్యార్థులు సోమవారం క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి క్షేత్ర విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా దర్శించుకున్నారు.  క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, ఘనపురం నరేష్, రామచం ద్రయ్య, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే పాల్గొన్నారు.