10 April, 2026 | 5:23 PM

Breaking News

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి   •   గల్ఫ్ బాధితుల కోసం అడ్వైజరీ కమిటీ ఏర్పాటు   •   సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •  

సూర్యక్షేత్రంలో విద్యార్థుల పూజలు

02-12-2025 12:53 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 1: రాష్ట్రంలోని తొలి సూర్యక్షేత్ర మైన తిమ్మాపురంలోని అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి క్షేత్రాన్ని జిల్లా కేంద్రం సూర్యాపేటలోని చర్చి కాంపౌండ్ లో ఉన్న న్యూ మిలీనియం హైస్కూల్ విద్యార్థులు సోమవారం క్షేత్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి క్షేత్ర విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీరామకోటి స్తూపాలను కూడా దర్శించుకున్నారు.  క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, ఘనపురం నరేష్, రామచం ద్రయ్య, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్ పాండే పాల్గొన్నారు.