calender_icon.png 5 May, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యాన్ని వెలికితీసేందుకే వేసవి శిబిరాలు

05-05-2025 01:47:32 AM

గురుకుల సెక్రటరీ అలగు వర్షిణి

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఆదివారం సమ్మర్ క్యాంపులను ఆమె సందర్శించి మాట్లాడారు..

ప్రతీ విద్యార్థికి శిక్షణనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించేందుకు ఈ క్యాంపులు ఎంతో దోహదపడతాయన్నారు. మొత్తం 238 గురుకుల విద్యాసంస్థల నుంచి 1,176 మంది విద్యార్థులు ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు.