18 April, 2026 | 10:35 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

నైపుణ్యాన్ని వెలికితీసేందుకే వేసవి శిబిరాలు

05-05-2025 01:47 AM

గురుకుల సెక్రటరీ అలగు వర్షిణి

హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ఈ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఆదివారం సమ్మర్ క్యాంపులను ఆమె సందర్శించి మాట్లాడారు..

ప్రతీ విద్యార్థికి శిక్షణనంతరం సర్టిఫికెట్ ప్రదానం చేస్తామన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదించేందుకు ఈ క్యాంపులు ఎంతో దోహదపడతాయన్నారు. మొత్తం 238 గురుకుల విద్యాసంస్థల నుంచి 1,176 మంది విద్యార్థులు ఈ వేసవి శిబిరంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు.