03-01-2026 12:00:00 AM
అచ్చంపేట, జనవరి 2: ప్రభుత్వ ఉద్యోగ ఉత్తమ సేవలతోనే ఉన్నత గుర్తింపు లభిస్తుందని అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, డిఎస్పి పల్లె శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి వేరువేరుగా ఆకాంక్షించారు. గతంలో జరిగిన లోపాలను సవరించుకొని ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని అభిలాషించారు. టీఎన్జీవో 2026 క్యాలెండర్ను అచ్చంపేటలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వేరువేరుగా ఆవిష్కరించారు.
ముందుగా టీఎన్జీవో నేతలు ఉన్నతాధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి ఈ ఏడాది సాధించబోయే లక్ష్యాల గురించి చర్చించారు. ఆయాచోట్ల నిర్వచన కార్యక్రమంలో టీఎన్జీవో అచ్చంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గణేష్, హనుమంతు, జిల్లా కార్యదర్శి బాలరాజు ఉపాధ్యక్షుడు విష్ణు, అమృతమ్మ కోశాధికారి పవన్, లోక్య, అల్లాజీ పవన్ విటల్, గోపి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.