calender_icon.png 26 June, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు అండ ఎర్రజెండానే..

11-06-2025 12:42:22 AM

- నూరేళ్ల ఉత్సాహంతో మరిన్ని పోరాటాలు నిర్వహిద్దాం

- ఆపరేషన్ కాగార్ నరమేధాన్ని ఆపండి

- ఖనిజ సంపద దోచుకునేందుకే బీజేపీ కుట్ర

- స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి

- సీపీఐ నేతలు హేమంతరావు, ఎస్కే  సాబీర్ పాషా

 చర్ల, జూన్10 (విజయక్రాంతి): నాటి నుండి నేటి వరకు ఎర్రజెండానే పేదలకు అండగా ఉందని, ఉంటుందని,  నూ రేళ్ల ఉత్సాహంతో మరిన్ని సమరశీల  పోరాటాలు నిర్వహిద్దామని భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు అన్నారు.

సిపిఐ చర్ల మండల 20వ మహాసభ మంగళవారం చర్ల సంతపాకల ప్రదేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ అధ్యక్షతన ఘనంగా జరిగింది.  ఈ సందర్భంగా భాగం మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల వి ముక్తి  కోసం ఎర్రజెండా వందేళ్ళగా నిరంతరాయంగా అ లుపెరగని పోరాటాలు సాగిస్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం అన్నారు. 

ప్రపంచం మొత్తం నేడు ఎర్ర జెండ వైపు చూస్తుందని, అనేక దేశాల్లో నేడు ఎర్రజెం డా రెపరెప లాడుతోందని, రాబోయే రోజులన్నీ ఎర్రజెండా వే  అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో అడవుల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా లు నరమేధాన్ని చేస్తున్నారని, మావోయిస్టులు లేకుండా చేస్తే అడవుల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను కారు చౌకగా దోచుకొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టొచ్చ ని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు.

వెంటనే ఆపరేషన్ కంగారును నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చ లు జరపాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్తో యుద్ధం ఏర్పడినప్పుడు పొరుగు శత్రుదేశంతో చర్చలు జరిపిన బిజెపి ప్ర భుత్వం సొంత దేశంలో సిద్ధాంతాల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల పేరుతో ఇబ్బడి ముప్పడిగా వందల కోట్లు దండుకొందని, అలాంటి పరిస్థితులు  ఈ ప్రభుత్వంలో రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ సమావేశం లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరు వెంకటేశ్వరరావు, నూపా పోతయ్య, నూప తి రుపతిరావు, పాలంచ రామారావు,పాలెం సత్యనారాయణ, నానిపల్లి  భద్రం,కనితి మంగమ్మ, ఉప్పులూరి నాగరాజు, గుంజి మాల్యాద్రి. పొడియం ఆదిలక్ష్మి, కాకర్ల అనసూయ, కోడిరెక్కల రాజారావు,ఆండ్రు, వామనరావు, చల్లా. లక్ష్మీ నారాయణ, కోటి. ముత్యాల రావు, ఉప్పులూరి వెంకట నర్స మ్మ, కల్లూరి సీతారాములు, కట్టం నాగేశ్వరరావు, కట్టం ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.