17-10-2025 12:47:58 AM
ఐదో బ్రాంచ్ను ప్రారంభించిన సినీ నటుడు మంచు మనోజ్, మంత్రి శ్రీధర్ బాబు
మణికొండ, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : అంతర్జాతీయ స్థాయి టెక్ట్స్టైల్స్ వ్యాపారానికి హైదరాబాద్ నగరం కేంద్రంగా మారు తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మణికొండలోని అల్కాపూర్ టౌన్షిప్లో ఏర్పాటు చేసిన పురుషుల వస్త్ర బ్రాండ్ ‘స్విచ్ రా’ ఐదో స్టోర్ ను గురువారం ఆయన సినీ నటుడు మం చు మనోజ్, మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ, స్విచ్ రా స్టోర్ ఫ్యాషనబుల్ కలెక్షన్లకు, సౌకర్యవంతమైన మ్యాన్వేర్కు హాట్స్పాట్గా నిలు స్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ము ఖ్యంగా, పిల్లల దుస్తుల ఎంపిక తల్లిదండ్రులకు కష్టతరంగా ఉంటుందని, ఈ స్టోర్లో ఆ సమస్య లేకుండా అద్భుతమైన కలెక్షన్ ఉం దని ప్రశంసించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, నాణ్యమైన వస్త్రాలను అం దించాలనే లక్ష్యంతో కల్లెం రాఘవేందర్ రెడ్డి, నంబూరి రాఘవేందర్, నీలా కిషోర్ కుమార్ ఈ షోరూం స్థాపించడం అభినందనీయమని అన్నారు.
యువత ఫ్యాషన్ రంగంలో రాణించడం సంతోషంగా ఉందని మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ తెలిపారు. స్విచ్ రా వ్యవస్థాపకులలో ఒకరైన కల్లెం రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రీమియం పురుషుల ఫ్యాషన్ను అందరికీ అం దుబాటులోకి తీసుకురావడం మా లక్ష్యం‘ అని వివరించారు.