14-06-2025 08:45:29 PM
తాడ్వాయి (విజయక్రాంతి): తాడ్వాయి అంబేద్కర్ ఫెడరేషన్ సంఘానికి ఉత్తమ అత్యున్నత పురస్కారాన్ని కామారెడ్డి జిల్లా జడ్జి వరప్రసాద్(District Judge Varaprasad) అందించారు. కామారెడ్డి జిల్లా తాడువాయి మండల అంబేద్కర్ ఫెడరేషన్ సంఘం నాయకులు అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి అత్యున్నతమైన పురస్కారం లభించింది. శనివారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తాడ్వాయి మండలం అంబేద్కర్ ఫెడరేషన్ సంఘానికి అత్యుత్తమ సేవలు అందించినట్లుగా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ... తాము నిర్వహించిన రక్తదాన శిబిరానికి ప్రత్యేక గుర్తింపు రావడం, పురస్కారం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు