07-06-2025 12:59:20 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట జూన్ 6 : గత సంవత్సరం డెంగ్యూ కేసులు న మోదు అయిన ప్రాంతాల్లో దోమల నివారణకు ఇప్పటి నుం చే పకడ్బందీగా కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. డ్రై డే ఫ్రై డే లో భాగంగా శుక్రవారం కొ త్తకోట మున్సిపాలిటీలోని 4వ వార్డు, 11వ వార్డు, మదన పూర్ మండలోని దంతనూరు గ్రామంలో కలెక్టర్ సందర్శిం చారు. డ్రై డే పాటిస్తున్న విధానాలను, ఆశ కార్యకర్తలు, అం గన్వాడి కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న తీరును పరిశీలించారు.
గత సంవత్సరం ఎక్కడైతే డెంగ్యూ, చికన్ గు నియా కేసులు నమోదు అయ్యాయో ఆ ప్రాంతంలో తిరిగి దోమలు ప్రబలి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుందని హె చ్చరించారు. ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి ఇంటి పరిసరాల్లో, ఇంటి పై కప్పు పై ఎక్కడ నిలువ నీరు ఆగకుండా నీరు పారవేయాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
పాత టైర్లు, పాత బకెట్లు, సీసా మూతలు, మూతల్లేని ట్యాంకుల్లో నిలువ నీరు లేకుండా చూసుకోవాలని సూచిం చారు. ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షల్లు చేయించే విధంగా అవగాహన కల్పించాలని సూ చించారు. క్రమం తప్పకుండా ఫీవర్ సర్వే చేయాలని ఆశా కార్యకర్తలను ఆదేశించారు. డెంగ్యూ , చికెన్ గునియా కేసులు నమోదు కాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చౌక ధర దుకాణాల్లో రికార్డులు సరిగ్గా నిర్వహించాలి
ప్రతి చౌక ధర దుకాణంలో బియ్యం నిల్వలు, లబ్ధిదారులకు ఇచ్చిన బియ్యం తదితర రికార్డులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. మదన పూర్ మండలంలోని దంతనూరు గ్రామంలోని చౌక ధర దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం తీసు కుంటున్న లబ్ధిదారులతో కలెక్టర్ మాట్లాడారు.
బియ్యం బాగుందా, ఇదే బియ్యం తింటున్నారా అనే వివరాలు అడుగగా బియ్యం బాగుందని, ఇదే బియ్యం తింటున్నామనీ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. పరిమళ, కొత్తకోట మున్సిపల్ కమిషనర్ సైదయ్య, తహసిల్దార్ అబ్రహం లింకన్ ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.