26-08-2025 12:24:17 PM
హైదరాబాద్: ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈనెల 29న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత రోజు నుంచే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. మొదటిరోజు ఇటీవల మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(Maganti Gopinath)కు అసెంబ్లీలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లో ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చలు జరపనున్నారు.