11-02-2025 12:00:00 AM
కరీంనగర్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు సోమవారం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీంద ర్సింగ్ నామినేషన్ దాఖలు చేసి బయటకు వస్తున్న క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ సమర్పిం చడానికి పీసీసీ ప్రెసిడెంట్, మంత్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయం లోపలికి వాహ నాలలో వెళ్లారు.
దీనిని గమనించిన రవీందర సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో రెండు వర్గాల కార్యకర్తల పోటాపోటీగా నినాదాలు చేస్తూ తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదర గొట్టి నామినేషన్ల ప్రక్రియ యధావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. సామా న్యులకు ఒక న్యాయం, అధికార పార్టీ మం త్రులకు మరో న్యాయం అంటూ రవీంద ర్సింగ్ విమర్శించారు.
ఎన్నికల నియమా వళిని ఉల్లంఘించిన మంత్రులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యా దు చేస్తానని పేర్కొన్నారు.