4 July, 2026 | 10:10 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

టెన్త్ జిల్లా టాపర్ నయన

01-05-2025 01:03 AM

పది ఫలితాల్లో 15వ స్థానంలో నిర్మల్ జిల్లా 

నిర్మల్ ఏప్రిల్ 30 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి ర్యాం క్ సాధించగా.. ఈ ఏడా ది మాత్రం 96.70 ఉత్తీర్ణత శాతంతో 15 స్థానంలో నిలిచినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు.

జిల్లాలో ఈ విద్యా సంవత్సరం మొత్తం 9123 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా 8822 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పట్టణంలోని వాసవి పాఠశాలకు చెందిన నల్ల నయన 600 మార్కులకు 589 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఆయన తెలిపారు. పరీక్ష ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.