16 March, 2026 | 2:54 PM

Breaking News

మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •   విద్యుత్ సరఫరాలో అంతరాయం   •  

పోలీసుల అదుపులోకి నిందితులు

28-12-2025 12:00 AM

కందుకూర్ క్రాస్ రోడ్డు హోండా షోరూమ్ పక్కన గదిపై దాడి

కందుకూరు, డిసెంబర్ 27(విజయ క్రాంతి): కందుకూర్ క్రాస్ రోడ్డు హోండా షోరూమ్ పక్కన గదిపై దాడిచేసిన నలుగురి వ్యక్తులు శనివారం కందుకూర్ పోలీసుల అదుపులో తీసుకున్నారు. కందుకూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రం, భగల్పూర్ జిల్లా, పిర్పింటి ప్రాంతానికి చెందిన మహ్మద్ చోటు (20) షేక్ రాజు (49), మహ్మద్ అస్లాం (36), మహ్మద్ రహమాన్ (20) ఈ నలుగరు ఒకే ప్రాంతానికి చెందివారు. విశ్వసనీయ సమాచారం మేర కు సర్చ్ నిర్వహించి ఆ నలుగురి నిందితులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరందరు పాత నేరస్తులు గుర్తించారు. కందుకూర్ క్రాస్ రోడ్డు హోండా షోరూమ్ పక్కన గదిపై గతంలో దాడి చేశారు. వీరి వద్ద నుంచి 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కందుకూర్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే సమాచారం ఇచ్చి సహకారించాలని కందుకూర్ పోలీసులు ప్రజలను కోరారు.