15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బంద్ శాంతియుతంగా ఉండాలి

18-10-2025 12:28 AM

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు  

డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): బీసీ సంఘాల జేఏసీ శనివారం తలపెట్టిన బంద్ నేపథ్యంలో డీజీపీ శివధర్ రెడ్డి కీలక సూచనలు జారీ చేశారు. బంద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలని, నిరసనల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చ రించారు.  బీసీల హక్కుల కోసం బీసీ సం ఘాల జేఏసీ పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలి, అని అన్ని రాజకీయ పార్టీలకు, సంఘాలకు సూచించారు.

బంద్ పేరుతో ఎవరైనా అ వాంఛనీయ ఘటనలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దిగినా చట్టప్రకా రం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్ప ష్టం చేశారు. రాష్ర్టవ్యాప్తంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పోలీస్ సిబ్బంది, ప్రత్యేక నిఘా బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తాయని ఆయన తెలిపారు.