17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాలి

24-05-2025 12:00 AM

-కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అమరుల బంధు మిత్రుల సంఘం

ముషీరాబాద్, మే 23 (విజయ క్రాంతి) : ఈనెల 21న నారాయణపూర్ ఎన్ కౌంటర్ లో అమరులైన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అమరుల బంధు మిత్రుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షులు భవాని, పౌర హక్కుల సంఘం నేతలు ఎన్.నారాయణ రావు, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఐఎఫ్టీవీ అనురాధ లు మాట్లాడుతూ మావోయిస్టు మృతదేహాల పట్ల ఉన్మాదంగా, అవమాననీయంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ తీరును వారు తీవ్రంగా ఖండించారు.

సీపీఐ మావోయిస్టు కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని రక్త సంబంధీకులకు ఇవ్వకుండా ఛత్తీస్గడ్ పోలీసులు వేధించడం రాజ్యాంగం వ్యతిరేకమని వారు అన్నారు. మావోయిస్టు పార్టీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధం కావాలని వారు సూచించారు.

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పోలీసులు, దేశ సరిహద్దులోని సైనిక బలగాలను కూడా ఆదివాసీ ప్రాంతాల్లో లక్షలాదిగా మోహరించి హెలికాప్టర్లు, డ్రోన్లు, రాకెట్ లాంచర్లతో హత్యాకాం డకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు.  కేంద్ర ప్ర భుత్వం తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలకు జరపాలని డిమాండ్ చేశారు.