calender_icon.png 28 June, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దు వివాదం ముగిసినట్టే!

28-06-2025 01:21:39 AM

  1. చైనాతో ఉద్రిక్తతల పరిష్కారానికి భారత్ చొరవ
  2. నాలుగు సూత్రాల ఫార్ములా ప్రతిపాదించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్
  3. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్‌తో ఎస్సీఓ సమావేశంలో భేటీ
  4. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రస్తావించిన రాజ్‌నాథ్

కింగ్‌డావో, జూన్ 27: భారత్, చైనా మధ్య చాలాకాలంగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అడుగు లు పడ్డాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సం బంధాలను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం సందర్భంగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌తో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా నాలుగు సూత్రాలతో కూడిన ఫార్ము లాను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. సరిహద్దులో శాంతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా తన ప్రణాళికను చైనా ముందు ఉంచినట్టు రాజ్‌నాథ్ తెలిపారు. 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండాలని తొలి ప్రతిపాదన చేశారు. రెండో ప్రతిపాదన కింద సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పూర్తిగా చల్లార్చేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించాలని సూచించారు.

సరిహద్దుల మార్కింగ్, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవం తం చేసి వివాదాలకు శాశ్వత ముగింపు  పలకాలని మూడో ప్రతిపాదన చేశారు. చివరగా భారత్, చైనా మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడానికి, సంబంధాలను మెరు గుపరచడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగిం చుకుని కొత్త ప్రక్రియలను రూపొందించాలని తెలిపారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు

ఇదే సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాద అంశాన్ని కూడా లేవనెత్తారు. ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు తాము ఆపరేషన్ సిందూర్‌ను చేప ట్టినట్టు చైనా మంత్రికి తెలిపారు. సమావేశా లు విజయవంతమైనట్టు రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఆరేళ్ల తర్వాత కైలాస మా నససరోవర యాత్రను చైనా పునఃప్రారంభి ంచడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీహార్ ప్రత్యేక మదుబనీ పెయి ంటింగ్‌ను చైనా మంత్రికి రాజ్‌నాథ్ కానుకగా అందించారు.