calender_icon.png 17 December, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం ప్రభుత్వం అడుగులు

17-12-2025 12:00:00 AM

కరీంనగర్ క్రైం, డిసెంబరు 16 (విజయ క్రాంతి): 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ యుపిఎ చైర్ పర్సన్ గా కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాలలోని పేదలకు భరోసా కల్పించడానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.

మంగళవారం నగరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు. గత పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఎఒక్క పథకం తీసుకురాకపోగా మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని పార్లమెంటులో నూతన బిల్లు ప్రవేశపెట్టిన ఎన్డీఎ ప్రభుత్వం అప్పటికి ఇప్పటికీ 20 శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పటికి కనీసం కూలీ రేటు పెంచాలన్న సోయి కూడా లేదని, పని దినాలు కేవలం 25 రోజులు మాత్రమే పెంచారని అన్నారు.

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా నిర్దిష్ట మొత్తాన్ని కేటాయిస్తామని పేర్కొనడం వెనుక బీజేపేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు మొండి చేయి చూపే కుట్ర ఉందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరు తొలగించడంలో ఉన్న శ్రద్ధ పేదలకు న్యాయం చేయాలన్న దాంట్లో లేదని విమర్శించారు. తెలంగాణ లోని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపి లు ప్రజలకు సమాధానం చెప్పాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, మేకల నర్సయ్య, రమణా రెడ్డి, సుదర్శన్, మేరాజ్, మాసుం ఖాన్, తోట అంజయ్య, బషీర్, పెద్దిగారి తిరుపతి, కొట్టె ప్రభాకర్, అష్రఫ్, బత్తుల రాజ్ కుమార్, బషీర్, భారీ, సాయిరాం, ఉప్పరి అజయ్, యోనా, తదితరులు పాల్గొన్నారు.

సమద్ నవాబ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, డిసెంబరు 16 (విజయ క్రాంతి): సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సమద్ నవాబ్ మరణం పార్టీకి తీరని లోటని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో సమద్ నవాబు సంతాప సభ నిర్వహించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం, వారి అభ్యున్నతి కోసం సమద్ నవాబ్ తపించేవారని, వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

వారి కుటుంబంలో ఒకరికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని, నగరంలో ఏదో ఒక మార్గుకు సమద్ నవాబ్ మార్గుగా నామకరణం చేస్తామని అన్నారు. ఈ కా ర్యక్రమంలో నాయకులు ముడుపు మోహన్, కంరుద్దిన్, కొరివి అరుణ్ కుమార్, బానోతు శ్రావణ్ నాయక్, కామ్ రెడ్డి రామ్ రెడ్డి, పంజాల స్వామి గౌడ్, వెన్నం రజిత రెడ్డి, అహమ్మద్ అ లీ, అబ్దుల్ రహమాన్, ముస్తాక్, అమీర్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, మహమ్మద్, నిహాల్, లాయిక్, ష బానా మహమ్మద్, ఇర్ఫాన్, బషీరుద్దీన్, మిరాజ్ డాన్, అబ్దుల్ భారీ, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, సిరిపురం నాగ ప్రసాద్, వసీం, అక్బర్, ఆరిఫ్, గౌస్, పాషా, విక్టర్, సోహెల్, పాషా, జమీల్, సర్వర్, కలీం, సలీం, తదితరులు పాల్గొన్నారు.