25 March, 2026 | 3:05 PM

Breaking News

పొంచి ఉన్న ప్రమాదం   •   గురుకుల ప్రవేశ పరీక్షలో శ్రీవిద్య పాఠశాల విద్యార్థుల ప్రభంజనం   •   బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం   •   పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •  

మీటింగ్‌కు రాలేదని సీఈవో ఆగ్రహం

19-11-2024 12:00 AM

99 మంది తొలగింపు

న్యూయార్క్: అమెరికాకు చెందిన ఓ మ్యూజిక్ కంపెనీ సీఈవో తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్వహించిన సమావేశానికి హాజరుకాలేదని ఉద్యోగులను తొలగించారు.ఒకేసారి 99 మందిపై వేటు వేశారు. మొత్తం ఆ సంస్థలో 111 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ భారీ తొలగింపు చోటుచేసుకుంది.

ఆ సంస్థలో పనిచేస్తోన్న ఓ ఇంటర్న్ (కార్యకలాపాలు నిర్వహించే తాత్కాలిక ఉద్యోగి) పెట్టిన పోస్టుతో ఈ విషయం వైరల్‌గా మారింది. సందేశాలను బట్టి చూస్తే ఆ మ్యూజిక్ సంస్థ సీఈవో పేరు బాల్డ్విన్. జాబ్‌ను సీరియస్‌గా తీసుకోలేదని తొలగింపునకు గురైన ఉద్యోగులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కాగా, సీఈవో తీరుపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  మొత్తంగా ఈ వ్యవహారమంతా వింతగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.