10 May, 2026 | 10:37 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పాఠాలు బోధించిన కలెక్టర్

07-08-2025 01:04 AM

నిర్మల్, ఆగస్టు ౬ (విజయక్రాంతి):  నిర్మ ల్ గ్రామీణ మండలంలోని రత్నాపూర్ కాం డ్లి గ్రామ ప్రభుత్వ జడ్పీ హై స్కూల్‌ను కలెక్టర్  అభిలాష అభినవ్ ఆకస్మికంగా పరిశీ లించారు.  తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులకు పాఠాలు బోధించారు ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి, విద్యార్థుల హాజరుతోపాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల సరఫరాపై ఆరా తీశారు.

విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్, వారికి పాఠా లు చదివించడంతో పాటు లెక్కలు చేయించారు. పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి బోర్డు పరీక్షల్లో ఉత్త మ ఫలితాల కోసం ఇప్పటినుంచే పకడ్బందీగా సన్నద్ధమవాలని సూ చించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వంటకు కట్టెల పొయ్యి బదులుగా ఎల్పీజీ వాడాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు.వాటి సంరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం కీలకమన్నారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు, తహసిల్దార్ సంతోష్, ఎంపీడీవో గజా నన్, ఎంఈ ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.