calender_icon.png 18 June, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేకుర్తిలో భూబకాసురుల బాగోతం బట్టబయలు

18-06-2025 12:00:00 AM

-రెవెన్యూ రికార్డుల్లో లేని సర్వే నెంబర్లను పుట్టించిన వైనం

కరీంనగర్, జూన్ 17:(విజయక్రాంతి): నగరంలోని రేకుర్తి రెవెన్యూ పరిధిలోని 18వ డివిజన్లో భూ బకాసురుల బాగోతం మరో మారు బట్టబయలైంది. రేకుర్తి రెవెన్యూ పరి ధిలో 230 మాత్రమే సర్వే నెంబర్లు ఉండగా, తాజాగా 231, 232, 233 అనే నెంబర్లతో ఏకంగా దొంగ సర్వే నెంబర్లను భూమా ఫీయా కొత్తగా సృష్టించింది.

227 సర్వే నెంబర్లో షేక్ సాజిదాకు చెందిన 19గుంటల భూమిని పైన తెలిపిన దొంగ సర్వే నెంబ ర్లను సృష్టించి, నకిలీ భూ పత్రాలు తయారు చేయించి, ఆక్రమించిన అంశంలో కరీంనగర్ ఫతేపురాకు చెందిన షేక్ అబూబకర్ ఖాలీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నందెల్లి మహిపాల్ పై ఏ1గా కేసు నమోదయిందని ఫిర్యాదుదా రుడు షేక్ అబూబకర్ ఖలీద్ మీడియాకు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఫిర్యాదు దారుడు వెల్లడించిన కేసు వివరాల్లోకి వెళి తే...రేకుర్తి గ్రామ రెవెన్యూ శివారు సర్వే.నెం. 227 లో విస్తీర్ణం 1.20 ఎకరాల భూమి 1954-55 ఖాస్రా పహాని ప్రకారంగా పట్టా దారుల పట్టాదారు అయిన షేక్ సాజిద, తన అమ్మమ్మ, తాత షేక్ సాలం, భర్త షేక్ సాలెహ్ పేరిట పట్టా కలదు. అప్పుడు సాజిద తాత భూములు పంచగా సర్వే.నెం. 227 పూర్తి విస్తీర్ణం 1.20ఎకరాల భూమి, మాఅమ్మ షేఖ్ బీ, తండ్రి షేక్ సాలెహ్ కి ఇచ్చారు. 1954-55 పహాని కాస్తూ కాలంలో హిస్సిదారీ అని కూడా మాఅమ్మ పేరు నమోదు కాబడింది.

ఆ తర్వాత మా అమ్మ పేరిట ఉన్న ఆస్తులు వారసులైన మేము పంచుకొనగా సర్వే. నెం.227 లో విస్తీర్ణం 1.20 ఎకరాల భూమిని, పేఖా సాజిదా, తండ్రి పేఖ్ సాలేహ్ కి వచ్చినది తన సోద రుడైన షేక్ అబూబకర్ కు జీపీఏ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి దాకా 2014-15 వరకు పహానిలో కూడా నమోదు అయ్యి వున్నారు. తేది: 18జనబరి2010 న డాక్యుమెంట్ నెం.10/2010 ద్వారా శేఖా సాజిదా నుండి, షేక్ అబూ బకర్ జీపీ ఏ తీసుకొని కాస్తూ చేపిస్తు న్నారు. 

పథకం ప్రకారం కుట్ర పన్ని భూమి లేని వారి కి భూమి వున్నట్టు సృష్టించి, అస్తపురం సాయి లు, తండ్రి మల్లయ్య పేరిట 0.19 గుంటలు, అస్తపురం తిరుపతి, తండ్రి కొండయ్య పేరిట 0.19 గుంటలు, అస్తపురం మల్లయ్య, తండ్రి కొమురయ్య పేరిట 0.21 గుంటలుగా వున్నట్టు చూయించి ఇలా మొత్తం విస్తీర్ణం 1.19 ఎకరాల భూమిని దొంగ సర్వే నెంబర్లు వేసి (సర్వే నెం.లు 231, 232 మరియు 233) డాక్యుమెంట్ నెం.12965/2013 ద్వారా విక్రయ దస్తావేజు చేసుకొని దాదాపు పది సంత్సరాల తర్వాత తన సర్వే నెం.227 లోకి 2023 సం||లో అక్రమంగా ప్రవేశించి బ్లెడ్ ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తు న్నారని సమాచారం అందగా, తక్షణమే నేను, నాపనివారు రాజేందర్, మహబూబ్ ని మోఖా పైకి వెళ్లి పని ఆపమని చెప్పగా వారు వారు అక్కడికి వెళ్ళి పని ఆపమని చెప్పగా, నాపని వారిని నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ, మీ సార్ కి ఇక్కడ భూమి లేదు.

ఇది మా భూమి మరొకసారి మీరు గానీ మీ సార్ గానీ భూమి దగ్గరికి వస్తే చంపి ఇక్కడే పాతి పెడతామని బెదిరిం చినారని బూబాకర్ పేర్కొన్నాడు. మార్చి 2024 లో కరీంనగర్ వచ్చిన తర్వాత సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తెలుసుకోగా 231,232 మరియు 233 సర్వే నంబర్లు రేకుర్తి రెవెన్యు రికార్డులో లేవని 230 సర్వే నెంబర్ వరకే వున్నాయని తెలిసింది. ఆ తర్వాత నేను భూమి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నన్ను నా పని వారిని వేధి స్తూ మా భూమి ఇది, మీకు భూమి లేదంటూ మా భూమిని కబ్జా చేయాలనే దుర్బుద్ధితో నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదుదారుడు షేక్ అబుబకర్ ఖలీద్ పోలీసులను ఆశ్రయించాడు. 

నందేల్లీ మహిపాల్ బండి పల్లి సురేందర్ బండారి మారుతీలు ముగ్గురు కలిసి పధకం ప్రకారం కుట్ర పన్ని భూమి లేని వారికి భూమి వున్నట్టు పైన పేర్కొన్న అస్తపురం కుటుంబీకుల పేర్ల పై దొంగ సర్వే నెంబర్లు వేసి దొంగ దస్తావేజులు తయారు చేసిన అంశంలో కొత్తపల్లి ఎస్‌ఐ సాంబ మూర్తి కేసు నమోదు చేసినట్లు అబూబకర్ తెలిపారు.