16 April, 2026 | 6:14 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పేదల పక్షాన నిలబడే సీపీఐ, బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

15-12-2025 01:46 AM

గరిడేపల్లి, డిసెంబర్ 14 : నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు నిర్వహిస్తున్న సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు వీరం రెడ్డి శంబిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని గానుగబండ, రంగాపురం గ్రామపంచాయతీల్లో బిఆర్‌ఎస్ మద్దతుతో సీపీఐ ఎర్రజెండా ఎగరడం ఖాయమని అన్నారు.

ఆదివారం మండలంలోని గానుబండలో బీఆర్‌ఎస్, సీపీఐ ఐక్యత సమావేశంలో పాల్గొని అనంతరం వారు ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బీఆర్‌ఎస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థులు బడుగు,బలహీన వర్గాలకు అండగా ఉంటారని కావున వారిని అధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. సీపీఐ నాయకులు కడియాల అప్పయ్య, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొత్త సతీష్రెడ్డి, షేక్ సైదా హుస్సేన్, కొత్త రామకృష్ణారెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, పంగా గోవిందు, పోకల ఆంజనేయులు, ఈద ఆంజనేయులు, షేక్ నాగులమీరా, నబీసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.