calender_icon.png 10 June, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం

10-06-2025 12:32:48 AM

మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ 

యాదాద్రి భువనగిరి జూన్ 9 ( విజయ క్రాంతి ): తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల మహిళలను కోటీశ్వ రులను  చేయాలని లక్ష్యంతో  పలు కార్యక్ర మాలు చేపడుతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి వర్యులు దనసరి అనసూయ (సీతక్క) అన్నారు.

సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ & గ్రామీణ అభి వృద్ధి  శాఖ మంత్రి  దనసరి అనసూయ (సీతక్క) ,సి.ఎస్ కే.రామ కృష్ణా రావు లతో కలిసి  బడి బాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల పై  జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని ఇందులో భాగంగా మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ పంప్ లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

జిల్లాలలో  మహిళా సంఘాలకు పెట్రోల్ పంప్ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు వల్ల 10 కుటుంబాలు బాగు పడతాయని మంత్రి అధికారులను ఆదేశించారు.  నవంబర్ నాటికి జిల్లాలో చేపట్టిన నూతన ఇందిరా మహిళా శక్తి భవనాలు పూర్తి చేయాలని ఈ మహిళా శక్తి భవనాలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా గత నవంబర్ మాసంలో శంకుస్థాపన చేసుకున్నామని, చాలా జిల్లాలో వీటి పురోగతి ఆశించిన స్థాయిలో లేదని అన్నారు.

మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఏకరూప దుస్తులు కుట్టు పనులు వేగంగా జరిగాయని, దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. జూన్ 12న పాఠశాలలో పునః ప్రారంభోత్సవం సందర్భంగా పండగ వాతావరణం లో పిల్లలకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.  మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలని అన్నారు.

ప్రతి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సబ్ స్టేషన్ పరిధిలో 8 ఎకరాల అనువైన భూమి 10 రోజుల్లో గుర్తించాలని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశంలో నిర్వహించే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన రోల్మెంట్ గురించి చర్చించాలని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను రూపొందిం చాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరాలంటే మహిళలను భాగస్వామ్యం చేయడం చాలా కీలకమని సీ.ఎస్ పేర్కోన్నారు. 

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద వివిధ వాణిజ్య వ్యాపార యూనిట్ల మహిళల చే గ్రౌండింగ్ చేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సి ఈ ఓ శోభా రాణి, భువనగిరి ఆర్డిఓ కృష్ణా రెడ్డి, డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.