10 April, 2026 | 7:47 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి   •   సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అవగాహన కార్యక్రమం   •   భవన నిర్మాణ కార్మికులకు కార్మిక భవన్ ఏర్పాటుకు సహకరిస్తా   •   విజయక్రాంతి ఎఫెక్ట్   •   రుద్రారం శివారులో అక్రమ ఇసుక టిప్పర్ సీజ్... ఒకరి అరెస్ట్   •   రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం   •   దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •  

తార్నాక అభివృద్ధిపై సమన్వయానికి నాంది

01-01-2026 12:38 AM

డిప్యూటీ మేయర్‌ను కలిసిన నూతన డిప్యూటీ కమిషనర్

సికింద్రాబాద్ డిసెంబర్ 31 (విజయ్‌క్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సికింద్రాబాద్ జోన్ పరిధిలోని తార్నాక సర్కిల్కు నూతన డిప్యూటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి బుధ వారం తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి మాట్లాడుతూ తార్నాక సర్కిల్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పారిశుధ్యం, డ్రైనేజీ,రహదారులు,తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిం చారు. ఈ అనంతరం నూతన డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాట్లాడుతూ ప్రజల సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తామని,క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా తార్నాక సర్కి ల్లో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊపునిచ్చే దిశగా ఇరువురి మధ్య సానుకూల చర్చ జరిగినట్టు తెలియజేశారు.