15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వీరమల్లు ముగించారు!

07-05-2025 12:00 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లి దాదాపు ఐదేళ్లవుతోంది. రాజకీయాల్లో బిజీగా మారిన నేపథ్యంలో ఈ సినిమాను పూర్తి చేయలేకపోయారు. అందుకే ఈ సినిమాతో పాటు తన చేతిలో ఉన్న మరో మూడు చిత్రాలనూ ఆగస్టులోగా పూర్తిచేస్తానని పవన్ నిర్మాతలకు మాటిచ్చినట్టు సమాచారం.

ఈ క్రమంలోనే పవన్‌కల్యాణ్ తాజాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేశారు. పవన్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తయింది. రెండు రోజుల పాటు పవన్ షూటింగ్‌లో పాల్గొనడంతో ఇది సాధ్యమైందని మేకర్స్ వెల్లడించారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ లెక్కన మే 30 లేదా జూన్ రెండో వారంలో ఈ సిని మా థియేటర్లకు వచ్చే అవకాశముందని ఫిలింనగర్ టాక్. త్వరలో ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వ హించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.