27-05-2025 07:22:10 PM
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగురి నరసింహ...
మునుగోడు (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన సామాజిక కార్యదర్శిల మీద మునుగోడు మండల ఇన్చార్జి ఎంపీడీవో విజయ్ భాస్కర్(MPDO Vijay Bhaskar) కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగురి నరసింహ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో కార్యదర్శులపై ఇంచార్జ్ ఎంపీడీవో విజయ్ భాస్కర్ చేస్తున్న కక్షసాధింపులకు వ్యతిరేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఈ వివిధ గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న అనగారిన వర్గాలకు చెందిన కార్యదర్శులపైన ఇంచార్జ్ ఎంపీడీవో కక్ష సాధింపు చర్యలు తీసుకొని ఆయనకు అనుకూలంగా పనిచేస్తలేరని ఉత్సాహంతో ఏ మండలాలలో లేని విధంగా ఏబిసి గ్రేడ్లు చేసి కార్యదర్శులను ఇతర మండలాలకు బదిలీ చేయాలని ఉన్నత అధికారులకు సిఫారసులు చేయడం సరైంది కాదని మండిపడ్డారు.
గ్రామాలలో ఇప్పటివరకు ప్రజా ప్రతినిధిలో పాలన లేకున్నా గ్రామ అభివృద్ధి కోసం ఉన్నత అధికారుల ఆదేశాలను పాటిస్తూ నిత్యం కృషి చేస్తున్న కార్యదర్శులపైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని బదిలీలు చేయడం సరైనది కాదని అన్నారు. మండల కేంద్రంలో చిరు వ్యాపారాలు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న వారిని రోడ్ల మీది నుంచి తోపుడు బండ్లను తొలగించాలని లేనియెడల జరిమానాలు విధిస్తామనడం సరైనది కాదని అన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, గోసుకొండ లింగయ్య, ఉప్పునూతల రమేష్, దుబ్బ వెంకన్న, వనం వెంకన్న, మండల కౌన్సిల్ సభ్యులు ఎండీ జానీ, కురుమూర్తి ముత్తయ్య ఉన్నారు.