30-05-2025 12:00:00 AM
- విశ్వహిందూ పరిషత్
ఖైరతాబాద్, మే 29 (విజయక్రాంతి) : గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు నరసింహమూర్తి, జాతీయాధికార ప్రతినిధి రావి నూతల శశిధర్లు మాట్లాడారు.. బక్రీద్ సం దర్భంగా రాష్ట్రంలో గోవధ రెట్టింపు స్థాయి లో జరుగుతుందని అన్నారు.
అంతేకాకుం డా వేలాది టన్నుల గోమాంసాన్ని విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు. గోవులను కాపాడాలనుకునే ఉద్దేశంతో 1977 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. కానీ ఆ చట్టాలను ఏమీ పట్టించుకోకుండా చేస్తున్నారని వెంటనే దీన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు.
గో వధను అరికట్టాల్సిన ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ఇప్పటికైనా గోహత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రం లో చట్టవిరుద్ధంగా కొనసాగుతున్న గోవధ శాలలను తక్షణం మూసివేయాలన్నారు.
భాగ్యనగర్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల శివారులలో ప్రత్యేకంగా పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమంగా తరలింపబడుతున్న గో సంతతిని రక్షించడంతోపాటు రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గో రక్షకులకు రాష్ట్ర ప్రభు త్వం గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గో రక్షా విభా గం రమేష్ బాబు, శివానంద్ తదితరులు పాల్గొన్నారు.