30-05-2025 12:00:00 AM
- టీఎస్యూటీఎఫ్ ప్రచార జాతలో డిఈఓ
మంచిర్యాల, మే 29 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంచుదామని, సర్కారు బడిని బలోపేతం చేద్దామని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య పేర్కొ-న్నారు.
గురు వారం టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార జాతను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జండా ఊపి ప్రారంభించిన అనం తరం ఆయన మాట్లాడుతూ ఒక ఉపా-ధ్యాయ సంఘంగా టీఎస్ యుటిఎఫ్ ఉపా ధ్యాయ ప్రయోజనాలు మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకోవడం కోసం ఒక ప్రచార యాత్రకు నిర్వహి స్తుండటం అభినంద-నీయమన్నారు.
ప్రభు త్వ పాఠశాలను బలోపేతం చేసుకోవడం కోసం ఉపాధ్యాయులు, తల్లిదం-డ్రులు, యువత, ప్రభుత్వం అంతా కలసి ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నదన్నారు. మంచి సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే విలువలతో కూడిన విద్య అందుతుంద-న్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం పాఠశాలకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. తల్లిదం-డ్రులు గమనించి ప్రభుత్వ పాఠశాలలకు మీ పిల్లలను పంపించాలని కోరారు.
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోతుం-దనీ, ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు పెద్ద మొత్తంలో అనుమతులు ఇవ్వడం, మరో వైపు ప్రభుత్వ పాఠశాలలకు సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడమేనన్నారు.
ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం బడిబాటను ముందుగానే ఏర్పాటు చేసి పాఠశాలల్లో సౌకర్యా లను కూడా అందించే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు, తరగతి కి ఒక గది ఉండే విధంగా, హై స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జి చక్రపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి జి రాజావేణు, జిల్లా సెక్టోరల్ అధికా రులు చౌదరి, సత్యనారాయణ మూర్తి, శ్రీనివాస్, ఏ సి జి ఈ దామోదర్ రావు, జిల్లా సైన్స్ అధికారి మధు బాబు, జిల్లా ఉపాధ్య-క్షులు వి కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్సులు కె చంద్రమౌళి, బి దేవదాస్, ఏ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.