వీర వనిత అనసూయమ్మ జీవితం
- నేటి సమాజానికి ఆదర్శనీయం
వెలిదండలో జరిగే అనసూయమ్మ వర్ధంతి సభను జయప్రదం చేయండి
సీపీఎం నాయకుడు పారేపల్లి శేఖర్ రావు
గరిడేపల్లి, ఏప్రిల్ 1 : కామ్రేడ్ వీరవనిత మేదరమెట్ల అనసూయమ్మ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సిపిఎం నాయకుడు పారేపల్లి శేఖర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని వెలిదండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల సైదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం భర్త మేదరమెట్ల సీతారామయ్య అడుగుజాడల్లో నడుస్తూ తన పోరాటపటిమని చాటిన వీర వనిత అనసూయమ్మ జీవితం చిరస్మరణీయమని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీర వనిత మేదరమెట్ల అనసూయమ్మ జీవితం అందించిన పోరాట స్ఫూర్తిని మనమంతా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల నాలుగో తారీఖున వెలిదండ లో జరిగే వర్ధంతి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకోబ్,దోసపాటి భిక్షం ,బొల్లెపల్లి శ్రీనివాస్, ఏనాల సోమయ్య, బోయిళ్ళ అర్జున్, దోసపాటి సుధాకర్, యామగాని వెంకటేశ్వర్లు, నందిపాటి మట్టయ్య,యానాల బిక్షమయ్య, సారెడ్డి సైదిరెడ్డి,సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు




