13-08-2025 05:20:31 PM
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ ఇన్ ఫ్లో ..
26 క్రఫ్ట్ గేట్లు పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల..
నాగార్జునసాగర్ (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చెరువులు, కుంటలు వరదలతో నిండిపోయాయి. దీంతో దుగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతోంది. ఇక, భారీ వర్షాలతో జలాశయంలోకి పెద్దఎత్తు వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో సాగార్ డ్యామ్ నిండుకుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు జలాశయం 26 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2,28,601 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ఫ్లో 2,47,986 క్యూసెక్కులుగా ఉంది. ఇక, డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.20 అడుగులకు చేరుకుంది. సాగర్ జలాశయం వద్ద జలకళ సంతరించుకోవడంతో అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు. సాగర్ అందాలను చూసేందుకు వచ్చే సందర్శకులతో డ్యామ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.