calender_icon.png 14 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూధార్ నంబర్లను కేటాయించాలి

14-08-2025 12:46:21 AM

- మ్యుటేషన్లు త్వరగా పూర్తిచేయాలి

- నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం

- సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాప్తంగా భూములకు త్వరలో భూధార్ నంబర్ల కేటాయించాలని, ఇందుకు అవసరమైన ప్రణా ళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్  సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.

రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూట్నీ చేసేలా చూడాలని సీఎం సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు.

ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని, కార్యాలయాలు పూర్తిగా ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో, సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. రాష్ర్టవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిర మ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖ రులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సీఎం సూ చించా రు.

హైదరాబాద్ నగరంలోని హౌసిం గ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించా లని సీఎం ఆదేశించారు. సమీక్షలో రాష్ర్ట రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వీ శేషాద్రి, కేఎస్ శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీసీఎల్‌ఏ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్ తదితరులు ఉన్నారు.