9 April, 2026 | 7:16 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి

28-11-2025 01:22 AM

ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్‌రెడ్డి

భద్రాచలం, నవంబర్ 27, (విజయక్రాంతి):గ్రామపంచాయతీ ఎన్నికలు2025 ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకుడు, గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గురువారం బూర్గంపహడ్, భద్రాచలం మండల పరిధిలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. మొరంపల్లి బంజర్, లక్ష్మీపురం, పినపాక పట్టి నగర్, బూర్గంపాడు, భద్రాచలం గ్రామపంచాయతీల నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, హెల్ప్డెస్క్ల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, భద్రతా ఏర్పాట్లను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఎన్నికల సాధారణ పరిశీలకుడు సర్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..నామినేషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాలని అధికారులను, సిబ్బందిని సూచించారు. అభ్యర్థులకు అవసరమైన సమాచారం సకాలంలో అందేలా హెల్ప్డెస్క్లను సమర్థవంతంగా నిర్వహించాలని, అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభ్యర్థులకు సహాయం అందించాలన్నారు.

అలాగే, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కట్టుదిట్టమైన సూచనలు చేశారు.నామినేషన్ కేంద్రాల్లో ఏర్పాట్ల పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు, భద్రాచలం ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.