6 July, 2026 | 3:12 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి

24-05-2025 12:31 AM

జిల్లా రిసోర్స్ పర్సన్స్ దయాకర్, శ్రీనివాస్

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మే23: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని జిల్లా రిసోర్స్ పర్సన్ గోదేశి దయాకర్,నల్ల శ్రీనివాసులు కోరారు.శుక్రవారం జాజిరెడ్డిగూడెం మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల 4వ రోజు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రోగ్రాంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థుల ప్రగతి అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన విధానంలో మార్పులను తీసుకొని జరపాలని కోరారు.విద్యార్థుల నమోదు విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి బాలునాయక్,ఆర్పీలు వి సైదులు,సీహెచ్ నాగరాజు,కే రమేష్,పి మల్లయ్య,బి శ్రీనివాస్,ఆర్ సృజన,ఎన్ వెంకన్న,స్వరూపారాణి,వివిధ పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.