16-06-2025 12:23:15 AM
- తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నందిమల్ల యాదయ్య ముదిరాజ్
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి, జూన్ 15 ( విజయక్రాంతి ) : పార్టీ బలోపితం కోసం కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తను గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ కే సాధ్యం అవుతుందని అందు లో భాగంగానే వనపర్తి నియోజకవర్గం లో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య ముదిరాజ్ కు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ కమిటీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రం లోని పీర్ల గుట్ట నుండి దాచలక్షయ్య ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన సభ ప్రాగణం వరకు బైక్ ర్యాలీ ని నిర్వహించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతు.... ప్రజా ప్రభుత్వం ఏర్పడినంక నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ 65 వేల ఉద్యో గాలను ఇచ్చామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పించామని, రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుకు ఆసరాగా నిలబడ్డామన్నారు.
భారతదేశంలోనే కుల గణన చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించుకోవాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామస్థాయి నుండి బలంగా ఉండాలనే భావనతో కమిటీల పర్యవేక్షణ ఏఐసీసీ నెంబర్లు చూసుకుంటున్నారని అందులో భాగంగా శనివారం తమిళనాడు మాజీఎంపీ, ఏఐసీసీ సెక్రెటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ లో ఉన్న సమ స్యలను పిసిసి అబ్జర్వర్లు తో తెలుసుకుంటూ పార్టీనిబలోపేతం కోసం వచ్చారని తెలిపారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య ముదిరాజ్ మాట్లాడుతు 1999 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూపార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ పదవి దక్కిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం నందిమల్ల యాదయ్య కుటుంబ సభ్యులను ముఖ్య అతిధులు, పార్టీ నాయకులు శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించా రు. ఈ సమావేశంలో ఏఐపిసి నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి , వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, వనపర్తి మార్కెట్ కమి టీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.