15 April, 2026 | 2:18 AM

‘పది’ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థినుల ప్రతిభ

01-05-2025 12:00 AM

మునిపల్లి, ఏప్రిల్ 30 : పదవ తరగతి పరీక్షలో మండల పరిధిలోని కంకల్ జడ్పీహెఎస్ పాఠశాల విద్యార్థిని జి.వర్షిక  590 మార్కులు సాధించి మండల టాపర్ గా గెలిచింది. అలాగే 573 మార్కులతో హారిక సెకండ్ టాపర్‌గా నిలిచింది. ఇందుకు కృషి చేసిన ఎంఈఓ భీమ్ సింగ్, ఉపాధ్యాయులను గంధం సరస్వతి ఫౌండేషన్ చైర్మన్ మల్లికార్జున్, పలువురు అభినందించారు.