18-10-2025 12:00:00 AM
సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట
ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన
ఎల్బీనగర్, అక్టోబర్ 17 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇన్ చార్జి ఉపేంద్ర మాదిగ, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి బత్తిన సుధాకర్ మాదిగ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై బూటు విసిరి దాడికి పాల్పడ్డ అడ్వకేట్ రాకేశ్ కిశోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడాన్ని జీర్ణించుకోలేని అగ్రవర్గాల శక్తులు దాడి చేయించారని విమర్శించారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకురాలు విద్యావతి, వేణు గౌడ్, ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రకాశ్ మాదిగ, రాజు మాదిగ, శేఖర్ మాదిగ, సురేష్ మాదిగ, విజయ మాదిగ, నర్సింగరావు, పరశురాం మాదిగ, చంటి మాదిగ, మౌలాలి మాదిగ, ఎలియ మాదిగ, రంగన్న మాదిగ, దేవా మాదిగ, రవి మాదిగ, సంతోషి మాదిగ, సుమన్ మాదిగ, సురేష్ మాదిగ, యాదయ్య మాదిగ, సునీల్ మాదిగ, మంద రవి, మంద సృజన్, చెన్నయ్య, చంద్రశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.