18-12-2025 12:59:47 AM
హకీంపేటలో ఘన స్వాగతం
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 17 (విజయక్రాంతి): శీతాకాల విడిది కోసం రా ష్ర్టపతి ద్రౌపది ముర్ము బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు ప్రత్యేక విమా నంలో చేరుకున్న ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ర్టపతి నిలయానికి చేరుకున్నారు.
ఐదు రోజుల షెడ్యూల్ ఇదే..
ఈ నెల 17 నుంచి 22 వరకు మొత్తం ఐదు రోజుల పాటు రాష్ర్టపతి హైదరాబాద్లోనే బస చేయనున్నారు. గురువారం విరామం అనంతరం శుక్రవారం ఉదయం 11 గంటలకు రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. అక్కడ జరగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును ప్రారంభిస్తారు. 20న గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో జరిగే ప్రత్యేక సదస్సుకు హాజరవుతారు.
కట్టుదిట్టమైన భద్రత
రాష్ర్టపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆమె పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లుడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్టుల ఎగురవేతపై పూర్తి నిషేధం విధించారు.