15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బడి బాధ్యత భవిష్యత్తుని పరిచయం చేసేది గురువే: కార్పొరేటర్ శాంతి

20-11-2025 05:40 PM

ఉప్పల్ (విజయక్రాంతి): బడి బాధ్యత విద్యార్థులకు భవిష్యత్తును పరిచయం చేసేది ఉపాధ్యాయులేనని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ అన్నారు. వెస్లీ స్కూల్లోని టీచర్ల కొరత ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలోని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి రెండు సంవత్సరాలుగా ఓ ప్రైవేట్  ఉపాధ్యాయురాలు అరుణను  నియమించి ప్రతినెల  జీతం అందిస్తున్నారు. గురువారం రోజున నాచారం కార్పొరేటర్ శాంతి ఎమ్మెల్యే తరపున అధ్యాపకురాలకి జీతాన్ని అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ  విద్యార్థి జీవితాన్ని సరైన దారిలో పెట్టేది గురువు అని అన్నారు. ఏది మంచో ఏది చెడు పిల్లలకు తెలిపేది తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం ఒక టీచర్ మాత్రమే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయిజెన్ శేఖర్ నాచారం నాయకులు విట్టల్ యాదవ్ వెస్లీ స్కూల్  ఉపాధ్యాయులు పాల్గొన్నారు