16 April, 2026 | 7:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

28-10-2025 12:40 AM

 అడిషనల్ ఎస్పీ మహేందర్ 

రేగోడు, అక్టోబర్ 27 : పోలీస్ అమరవీరులు త్యాగాలు మరువలేనివని జి ల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్ అ న్నారు. అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో భాగంగా సోమవారం పో లీస్ స్టేషన్ లో మండలంలోని పోచా రం గ్రామానికి చెందిన అమరుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రా ములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉం టామని ఆయన అన్నారు.

విధి నిర్వహణలో అమరుడైన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాములు సతీమణి సుందరమ్మకు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రస న్నకుమార్, అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి, రేగోడు ఎస్త్స్ర పోచయ్య, శంకరంపేట ఎస్త్స్ర ప్రవీణ్ రెడ్డి, అల్లాదుర్గo ఎస్త్స్ర శంకర్, రేగోడు ఎఎస్త్స్ర లు, పెంటప్ప, శంకర్ పోలీస్ సిబ్బంది మండల నాయకులు మాజీ కోఆప్షన్ సభ్యులు చోటు బాయ్, మాజీ సర్పంచ్ మన్నె విజయభాస్కర్, వట్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీధర్ గుప్తా, తదితరు లు పాల్గొన్నారు.