28-10-2025 12:40:27 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్27( విజయక్రాంతి): దహేగాం గెర్రె గ్రామంలో కుల దురహంకార హత్యకు గురైన తలండి శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యం లో కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సం దర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, టిఏజిఎస్ జిల్లా కార్యదర్శి నేర్పల్లి అశోక్ లు మాట్లాడుతూ శ్రావణి భర్త శేఖర్ కుటుంబ సభ్యులపై రెండు హత్య కేసులు నమోదు చేయాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వరం న్యాయవిచారణ జరపాలన్నారు.
యువతి కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుటుంబానికి మూడెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 25 లక్షల ఎక్ష్ గ్రేషియా మంజూరు చేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకు న్న వారిని రక్షించేందుకు చట్టాలు తీసుకురావాలన్నారు. కుల వ్యవస్థను రద్దు చేస్తూ పార్లమెంటులో చట్టం చేయాలన్నారు. ప్రభు త్వం న్యాయం చేయకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించా రు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాలశ్రీ, నేర్పెల్లి అశోక్, ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్, సిపిఎం పార్టీ కాగజ్నగర్ కన్వీనర్ ముంజం ఆనంద్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్, గోడిసెల కార్తిక్, ఉపాధ్యక్షులు పురుషోత్తం, నిఖిల్, సహాయ కార్యదర్శి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వసాకే సాయి, చాపిలే సాయి కృష్ణ,
ఐద్వా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వినోద, అనిత, జిల్లా ఐద్వా కోశాధికారి షాహిన్, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా జిల్లా ఉపాధ్యక్షులు బక్కన్న, నైతం రాజు, దహేగం మండల అధ్యక్షులు సిడాo శంకర్, జిల్లా కమిటీ సభ్యురాలు దూల లక్ష్మి, శాగం కమల, గ్రామ అధ్యక్షులు మేకల శంకర్, కట్టేకోల హనుమంతు,గోండ్వానా ఆదివాసి కోయా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోయం చిన్నయ్య, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోట సతీష్, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి,
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షు లు ఆవిడపు ప్రణయ్, ఆదివాసి సంఘం నాయకులు పెందూర్ రాజేష్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు, ఏఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి పోషమల్లు, స్త్రీ విముక్తి మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు లావణ్య, పిడిఎస్యు విజృంభన మహేష్, తలండి మధుకర్,మేడి సతీష్, పెద్ది సంతోష్, దహేగాం మండలంలోని గేర్రె, చిన్నరాస్పల్లి, ఓడ్డుగూడా ప్రజలు పాల్గొన్నారు.